బీజేపీలోకి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ కు గుడ్ బై
దేశంలోనే అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
![బీజేపీలోకి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ కు గుడ్ బై](https://naatelanganadaily.com/uploads/images/202403/image_870x_6605873624174.jpg)
చండీగఢ్: దేశంలోనే అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని సావిత్రి జిందాల్ బుధవారం అర్థరాత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. గురువారం బీజేపీలో చేరారు. హిస్సార్ కు పదేళ్లు ప్రాతినిధ్యం వహించానని, హరియాణాకు మంత్రిగా కూడా పనిచేశానని ప్రజలను తనపై, తన కుటుంబంపై చూపుతున్న అభిమానం, ఆప్యాయతలకు సదా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల సలహా మేరకు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వివరించారు. కొద్ది రోజుల క్రితం సావిత్రి కుమారుడు మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కూడా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మాజీ మంత్రి ఓపీ జిందాల్ కుమారుడు నవీన్.. కురుక్షేత్ర నుంచి ఈ సారి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు.