నా తెలంగాణ, మెదక్: మెదక్ జిల్లాను రాజన్న జోన్ నుంచి చార్మినార్ జోన్ కు మార్చేందుకు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ట్రెస అధ్యక్షులు మహేందర్ గౌడ్ తో కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన దామోదర రాజనర్సింహను కలిసి తమ సమస్యలను వివరించారు. రాజన్న జోన్ లో చేర్చడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల లాభనష్టాల గురించి, స్థానికత గురించి మంత్రికి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంత్రికి జ్ఞాపికను అందించారు. మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు మహ్మద్ ఇక్బాల్ పాషా, ట్రెస నాయకులు సిద్దు, పరమేశ్వర్, నాగరాజు తదితరులున్నారు.