స్వైన్ ఫ్లూ అలర్ట్ జారీ!
Swine flu alert issued!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో మరోమారు స్వైన్ ఫ్లూ కేసుల్లో పెరుగుదల నమోదవుతుంది. మంగళవారం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ) నివేదిక జారీ చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఎనిమిది రాష్ట్రాల్లో హెచ్1ఎన్1 వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందని స్పష్టం చేసింది. 16రాష్ట్రాల్లో ఈ వ్యాధి బారిన పడగా, ఆరుగురు మృతిచెందారని తెలిపింది. మరణాల సంఖ్య కేరళలో ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం.. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లో స్వైన్ ఫ్లూకు సంబంధించి నిఘా పెంచాలని ఎన్ సీడీసీ విజ్ఞప్తి చేసింది. తమిళనాడు - 209, కర్ణాటక -76, కేరళ 48, జమ్మూ కాశ్మీర్ 41, ఢిల్లీ 40, పుదుచ్చేరి 32, మహారాష్ట్ర 21, గుజరాత్14 కేసులు నమోదైనట్లు వివరించింది.2024లో దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు 20,414 మందికి సోకగా, 347 మంది మృతిచెందారు. 2019లో అత్యధికంగా 29,798 కేసులు నమోదు కాగా 1,218 మంది మృతిచెందారు.