9మంది నక్సలైట్ల లొంగుబాటు

Surrender of 9 Naxalites

Feb 23, 2025 - 20:08
 0
9మంది నక్సలైట్ల లొంగుబాటు

నా తెలంగాణ, ములుగు: తెలంగాణ ములుగు జిల్లాల్లో చత్తీస్​ గఢ్​ కు చెందిన 9మంది నక్సలైట్​ లు ఆదివారం లొంగిపోయారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ చేయూత ద్వారా మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్​ అధికారులు స్పష్టం చేశారు. లొంగిపోయిన వారిలో మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. వీరంతా ఒకే కేడర్​ కు చెందిన వారిగా సమాచారం. ప్రశాంత జీవితం కోసం స్వచ్ఛందంగా లొంగిపోయిందని అధికారులు వివరించారు. కాగా లొంగిపోయిన నక్సలైట్లు ఏ ప్రాంతానికి చెందిన వారు తదితర వివరాలను అధికారులు ప్రకటించలేదు.