సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ అమలు చేయాలి
మొయినాబాద్ పీఆర్ టీయుటీఎస్ డిమాండ్

నా తెలంగాణ, మొయినాబాద్: సీపీఎస్ (కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను అమలు చేయాలని మొయినాబాద్ మండల పీఆర్ టీయుటీఎస్ అధ్యక్షులు జక్కని బందయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి నరేందర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం పీఆర్ టీయుటీఎస్ కు చెందిన ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వం యూపీఎస్ పై విడుదల చేసిన గెజిట్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పీఆర్ టీయుటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మొయినాబాద్ తహశీల్దార్ వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 30 నుంచి 35 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అందించాలని డిమాండ్ చేశారు. ఇది వారి ప్రాథమిక హక్కుగా అభివర్ణించారు. ఉపాధ్యాయులందరూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోకుండా యూపీఎస్ ను తీసుకురావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన వారిలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, లక్ష్మన్, శివ కుమార్, నారాయణ, బీమ్లా, మహమూద్, శంకర్, వినోద్ కుమార్, రాములు, హుసేన్, రాములు, సిద్ధం శ్రీనివాస్, మహేందర్, విజయ్ బాయ్, రజినీ, లావణ్య, కైజర్ అహమ్మద్, మౌనేశ్వర, వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.