భూముల అందజేతలో జాప్యం

కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

Mar 8, 2025 - 16:22
 0
భూముల అందజేతలో జాప్యం

రహదారుల నిర్మాణంపై కృతనిశ్చయంతో ముందుకు
రూ. 6,280 కోట్లు ఖర్చు, రిజినల్​ రింగ్​ రోడ్డుకు రూ. 18,722 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
మరోమారు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాస్త

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఇప్పటికే రూ. 6,280కోట్లు ఖర్చు చేశామని, ఉత్తర ప్రాంత రీజినల్​ రింగ్​ రోడ్డు​ నిర్మాణానికి రూ. 18,772 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం భూములు అందజేస్తే మిగిలిన నిర్మాణాలు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు. భూముల అందజేతలోనే జాప్యం జరుగుతుందని వివరించారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశంలో జాతీయ రహదారులు, కనెక్టివిటీలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందజేశారు. 

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు 95 శాతం పూర్తి అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్​ అక్విజేషన్​ పోజిషన్​ ద్వారా అందించాల్సిన భూమిని అందించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, మరోమారు సీఎంకు లేఖ రాస్తానని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పది జాతీయ రహదారులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ ప్రారంభానికి రానున్నారని చెప్పారు. అంతేగాక మరిన్ని రహదారులు, కనెక్టివిటీ దారులపై ఆయనకు వివరించానని, కేబినెట్​ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. 

ఎన్​ హెచ్​ 44, 167, 202, 565, 65, 365ఎ, 61 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ చుట్టు ప్రాంతాలను ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే పనులు చేపట్టామని దాదాపు పనులు పూర్తి కావచ్చయన్నారు. ఆయా చోట్ల రాష్ర్ట ప్రభుత్వం భూములు అందించకపోవడంతో ఆలస్యం జరుగుతుందన్నారు. ఆరాంఘర్​ నుంచి శంషాబాద్​ వరకు ఆరులేన్ల విస్తరణ రూ. 300 కోట్లతో పూర్తయ్యిందన్నారు. నగరం నుంచి ఎయిర్​ పోర్ట్​ కు వెళ్లే ప్రజలకు సిగ్నల్స్​ ఫ్​రీ గా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబర్​ పేట్​ ఫ్లై ఓవర్​ కింద రోడ్డు నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ర్ట ప్రభుత్వం ల్యాండ్​ అక్విజేషన్​ ద్వారా భూమిని అప్పగిస్తే ఈ పనులు మొదలు పెడతామన్నారు. 

మహాబూబ్​ నగర్​– జడ్చర్ల, మిర్యాలగుడ, నకిరేకల్​–నాగార్జునసాగర్​, హైదరాబాద్​–పూణే, కోదాడ–ఖమ్మం, నిర్మల్​ ఖానాపూర్​, మంచిర్యాల – రేపల్లెవాడ, మహాబూబ్​ నగర్​–చించోలి, మహాబూబ్​ నగర్​–కల్వకుర్తి లాంటి అనేక జాతీయ రహదారి పనులు పూర్తి కావచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 
..................................