సంభాల్​ హింస.. న్యాయవాదిని చంపే కుట్ర బట్టబయలు

Sambhal violence. Conspiracy to kill lawyer exposed

Feb 20, 2025 - 18:21
 0
సంభాల్​ హింస.. న్యాయవాదిని చంపే కుట్ర బట్టబయలు

లక్నో: సంభాల్​ హింస కేసు విచారణలో తవ్వుతున్న కొద్దీ భయానక కుట్రలు వెలుగుచూస్తున్నాయి. హింస సందర్భంగా న్యాయవాది విష్ణు శంకర్​ జైన్​ ను చంపేందుకు పథకం పన్నినట్లు గురువారం పోలీసు అధికారుల వెల్లడించారు. హింస సందర్భంగా అరెస్టు చేసిన ఒక నిందితుడిని విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. నిందితుడు షరీఖ్​ సాతా అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు, ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. సాతా దుబాయ్​ లో కూర్చొని న్యాయవాది విష్ణు శంకర్​ జైన్​ ను చంపేందుకు ప్రణాళిక రచించాడన్నారు. హింస సమయంలో జైన్​ ను చంపాలని పథకం రచించాడని పేర్కొన్నారు. సంభాల్​ హింసలో జరిగిన ప్రణాళికలు, కుట్రకోణాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. వాట్సాప్​ గ్రూప్​ ల సృష్టి, ప్రజలు గూమిగూడాలని పిలుపు, ఆయుధాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు ఇలా అనేక విషయాలను పోలీసులు రాబట్టారు.