కేంద్రమంత్రి గోయల్​ తో చిత్రాన్ని పంచుకున్న థరూర్​

బీజేపీలో చేరడం లాంఛనమే?

Feb 25, 2025 - 16:45
 0
కేంద్రమంత్రి గోయల్​ తో చిత్రాన్ని పంచుకున్న థరూర్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు శశిథరూర్​ కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ తో దిగిన సెల్ఫీని మంగళవారం షేర్​ చేశారు. వీరిద్దరితోపాటు యూకె వాణిజ్య శాఖ మంత్రి జోనాథన్​ రేనాల్డ్స్​ కూడా ఉన్నారు. ఎఫ్​ టీఎ చర్చలు తిరిగి ప్రారంభించడం స్వాగతించదగినదాని థరూర్​ పేర్కొన్నారు. ఇరువురు మంత్రుల మధ్య సంభాషణ బాగుందన్నారు. బీజేపీ, మోదీ విధానాలను ఇటీవల శశి థరూర్​ వరుసగా ప్రశంసిస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతకుముందు నుంచే థరూర్​ ను కాంగ్రెస్​ పార్టీ పలు కార్యక్రమాలకు దూరంగా పెట్టడంతో ఆయన కినుక వహించారు. ఈ నేపథ్యంలో ఇక పార్టీ నుంచి వెళతాననే సంకేతాలను కూడా ఇప్పటికే ఇచ్చివేశారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయం మాత్రం తెలియలేదు. ఆయన ముందు బీజేపీ, సీపీఐ (ఎం) రెండే ఆప్షన్లు ఉండడంతో మంత్రి పీయూష్​ గోయల్​ చిత్రం పంచుకోవడంతో ఇక కమలంలో థరూర్​ చేరిక ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.