రాష్ట్రపతికి జెర్సీ బహూకరించిన సచిన్
Sachin presented the jersey to the President

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూతో ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ కలిశారు. గురువారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో ముర్మూను కుటుంబంతో సహా కలిసిన సచిన్ టెస్ట్ జెర్సీని బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, సచిన్ పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రపతి నిలయం బయట ఉద్యానవనంలో వీరిద్దరి సంభాషణలు జరిగాయి. అనంతరం సచిన్ కుటుంబంతో సహా రాష్ట్రపతితో కలిసి ఫోటోలు దిగారు.