సీపెక్​ డ్రాగన్​ యూటర్న్​ 

Seapec Dragon U-turn

Mar 16, 2025 - 17:50
 0
సీపెక్​ డ్రాగన్​ యూటర్న్​ 

కుప్పకూలనున్న పాక్​ ఆర్థిక వ్యవస్థ
తమను తామే కాపాడుకోలేని ఆర్మీ ప్రాజెక్టులను ఏం కాపాడుతుందంటున్న చైనా

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: పాకిస్థాన్​ లో బీఎల్​ ఎ (బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ) భారీ వరుస దాడులకు తెగబడడం ఆ దేశా ఆర్థిక వ్యవస్థను మరోసారి అగాధంలోకి నెట్టింది. వరుసదాడులపై చైనాకు చెందిన సీపెక్​ (సీపీఈసీ–చైనా పాక్​ ఎకనామిక్​ కారిడార్​)లో పెట్టుబడులను నిషేధించాలని చైనా నిర్ణయించినట్లు రక్షణ శాఖనిపుణుడు ఒకరు పేర్కొన్నారు. అంటే పెట్టుబడులపై డ్రాగన్​ యూటర్న్​ తీసుకుంది. దీంతో పాక్​ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినట్లయ్యింది. ఈ ప్రాజెక్టుపై పాక్​ భారీ ఆశలు పెట్టుకుంది. సజావుగా ప్రాజెక్టు కొనసాగించేందుకు 40వేల మంది ఆర్మీ సిబ్బందిని కూడా మోహరించింది. కానీ గత ఐదు రోజులుగా పాక్​ లో ఆర్మీపై జరుగుతున్న దాడుల పరిస్థితులను చైనా రక్షణ శాఖ నిశితంగా గమనిస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులను నిలిపివేయాలని నిర్ణయించింది. 

తనను తానే సురక్షితంగా ఉంచుకోలేకపోతే భారీ పెట్టుబడులతో చేపడుతున్న సీపెక్​ ప్రాజెక్టును ఎలా సురక్షితంగా ఉంచగలుగుతారని భావిస్తుంది. బలూచ్​ ప్రాంతం గుండానే ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ దారి గుండానే చైనా కార్మికులు, ఇంజనీర్లు, ప్రముఖ అధికారులు రాకపోకలు కొనసాగిస్తూ పనులను చేపడుతున్నారు. బలూచ్​ దాడులతో డ్రాగన్​ ప్రాజెక్టు నిర్మాణంపై వెనక్కు తగ్గింది. 

హింస పూర్తిగా తగ్గిపోయి, బీఎల్​ ఎను పాక్​ నిరోధించే వరకు, శాంతి కొనసాగే వరకూ ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టుకైనా నిధులను నిలిపివేయాలని చైనా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీపెక్​ ప్రాజెక్టు చేపడుతున్న తొలుతలో చైనా మేకపోతు గాంభీర్యంతో పాక్​ కు మనోధైర్యాన్ని అందించింది. ఒత్తిడి, ఆర్థికంతో పరిస్థితులను చక్కదిద్దాలని సూచించింది. దీంతో పాక్​ కూడా ఒకింత అడుగు ముందుకు వేసి ధైర్యంగా బలూచ్​ ప్రాంతంలో సీపెక్​ ప్రాజెక్టుకు ఒప్పుకొంది. ఇదే ఇప్పుడు ఆ దేశ ఆర్మీ మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు కారణభూతంగా నిలుస్తుంది. 

2001 నుంచి పాక్​ నిరంతరం బలూచ్​ ప్రాంతంలో సైనిక చర్య చేపడుతున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని  గత ఐదు రోజులుగా జరుగుతున్న దాడులతో తేలిపోయింది. ఈ సమయంలో నివురు గప్పిన నిప్పులా బీఎల్ ఎ కిమ్మనకుండా తన సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొని తిరిగి విజృంభించింది. పాక్​ ప్రభుత్వానికి, సైన్యానికి సవాల్​ విసురుతూ దాడులకు పాల్పడుతుంది. 

పాక్​ లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అఏ సమయంలో పాక్​ భద్రత కోసం 200 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కానీ బీఎల్​ ఎ దాడులతో ఇటు పాక్​, అటు డ్రాగన్​ కంట్రీ ఆశలు అడియాశలైనట్లయింది.