సైఫ్ పై దాడి షరీఫుల్ పనే
ఫేస్ రికగ్నైజేషన్ పరీక్షలో వెల్లడి

ముంబాయి: ఎట్టకేలకు సైఫ్ పై దాడి చేసింది బంగ్లాకు చెందిన షరీఫుల్ ఇస్లామేనని ఇద్దరు గుర్తించారు. దీంతోపాటు అతని ఫేస్ రికగ్నైజేషన్ పరీక్షలో కూడా కెమెరాలో రికార్డయ్యింది, ఇతను ఒక్కటేనని నిర్ధారణ అయ్యిందని గురువారం పోలీసులు తెలిపారు. దాడి జరిగిన మూడు రోజుల తరువాత షరీఫుల్ ను అరెస్టు చేశారు. సైఫ్ ఇంట్లో పలువురు పనిమనుషుల విచారణ సందర్భంగా నిందితుడిని గుర్తించే ప్రక్రియను కూడా చేపట్టారు. ఇద్దరు పనిమనుషులు దాడికి పాల్పడింది ఇతడేనని నిర్ధారించారని చెప్పారు. దీంతో వేలిముద్రలపై విభిన్న వార్తలు, సైఫ్ పై దాడికి పాల్పడిందే ఇతడేనా కాదా? అన్నదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందన్నారు. ముఖ గుర్తింపుతో పాటు, సంఘటన జరిగిన సమయంలో నిందితుడు ధరించిన దుస్తులు, ఆయుధాలు, పరికరాలు, ఒక టవల్, ఒక బ్యాగ్ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పోలీసులు పంపారు.