జాదవ్​ కిడ్నాప్​.. ముఫ్తీ హత్య!

Jadhav kidnapped.. Mufti murdered!

Mar 9, 2025 - 12:46
 0
జాదవ్​ కిడ్నాప్​.. ముఫ్తీ హత్య!

ఇస్లామాబాద్​: పాక్​ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్​ భూషణ్​ జాదవ్​ కిడ్పాప్​ లో సహాయం చేసిన ముఫ్తీ షా మీర్​ హత్యకు గురయ్యాడు. ఇతనిపై శుక్రవారం గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబట్టట్టు ఆలస్యంగా ఆదివారం మీడియాకు సమాచారం అందింది. 2016లో ఇరాన్​ లో ఉన్న జాదవ్​ ను ఐఎస్​ఐ సహాయంతో కిడ్నాప్​ చేసి పాక్​ చేతిలో పెట్టారు. బలూచిస్థాన్​ లో శుక్రవారం ప్రార్థనల అనంతరం దుండగులు మీర్​ పై కాల్పులకు తెగబడ్డారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. 

పాక్​ ప్రభుత్వం జాదవ్​ పై దేశద్రోహం కింద విచారణ చేస్తుంది. ఈ విషయంపై పలుమార్లు భారత్​ ఎన్నో అభ్యంతరాలను చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినా, ఉరిశిక్ష రద్దయ్యింది కానీ జాదవ్​ ఇప్పటికీ పాక్​ జైలులోనే ఉన్నాడు. ముఫ్తీ మీర్​ మానవ అక్రమ రవాణాకు పాల్పడే జమియత్​ ఉలేమా ఇ ఇస్లాం సభ్యుడు. భారత్​ లోనూ చోటు చేసుకున్న అక్రమ చొరబాట్లలో ఇతని హస్తం ఉన్నట్లు ఇంటలిజెన్స్​ గుర్తించింది. కాగా జాదవ్ కిడ్నాప్‌లో కీలక పాత్ర పోషించిన జైష్ అల్-అద్ల్ సభ్యుడు ముల్లా ఒమర్ ఇరానీని 2020లో టర్బాట్‌లో ఐఎస్ఐ కార్యకర్తలు కాల్చి చంపారు.