ఉపరాష్ట్రపతికి అనారోగ్యం.. ఎయిమ్స్​ లో చికిత్స

త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోదీ 

Mar 9, 2025 - 12:57
Mar 9, 2025 - 15:09
 0
ఉపరాష్ట్రపతికి అనారోగ్యం.. ఎయిమ్స్​ లో చికిత్స

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగదీప్​ ధంఖర్​ ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం తెల్లవారుజామున ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్​ లో చేర్చి చికత్స అందిస్తున్నారు. ఆయన ఛాతినొప్పితో బాధపడుతున్నారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్సనందిస్తుంది. జగదీప్ 2022 ఆగస్ట్​ 11న​ 14వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1951 జూలై 18న రాజస్థాన్​ లోని హనుమాన్​ గఢ్​ జిల్లాలోని కాళీబంగ్లాలో జన్మించారు. జగదీప్​ పశ్చిమ బెంగాల్​ గవర్నర్​ గా కూడా విధులు నిర్వహించారు. పంజాబ్​ విశ్వవిద్యాలయం నుంచి విద్యనభ్యసించి న్యాయపట్టాను పొందారు. ఓ వైపు న్యాయవాదిగా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ బీజేపీకి సేవలందించారు. అనేక పదవులను నిర్వహించిన జగదీప్​ ఉపరాష్ర్టపతికి ఎంపికయ్యారు.
ప్రధాని మోదీ పరామర్శ..
ఉపరాష్ర్టపతి ఆరోగ్య విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆదివారం ఉదయం ఎయిమ్స్​ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధంఖర్​ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
........................