యూఎన్​ఎస్​సీలో పాక్​ పై పర్వతనేని ఆగ్రహం

In the UNSC, there is a mountain of anger against Pakistan

Feb 19, 2025 - 13:39
Feb 19, 2025 - 13:39
 0
యూఎన్​ఎస్​సీలో పాక్​ పై పర్వతనేని ఆగ్రహం

న్యూయార్క్​: ఐక్యరాజ్యసమితిలో పాక్​ విధానాలను భారత ప్రతినిధి పర్వతనేని హరీష్​ తీవ్రంగా ఎండగట్టారు. బుధవారం చైనా అధ్యక్షతన యూఎన్​ ఎస్​ సీ భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్​ ఆరోపణలపై, హరీష్​ నిప్పులు చెరిగారు. కశ్మీర్​ ఎప్పటికీ భారత్​ లో అంతర్భాగమేనన్నారు. పాక్​ ఒక ఉగ్రవాద దేశమని ప్రపంచానికి తెలుసన్నారు. భారత్​ ఉగ్రవాద దాడి బాధిత దేశమన్నారు. మరోమారు ఇలాంటి అంశాలను మండలిలో లేవనెత్తి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. జేషే మహ్మద్​, లష్కరే తోయిబా, ఇంకా 20 ఉగ్రవాద సంస్థలు ఎక్కడ పుట్టాయని, ఎవరి ఇంట్లో ఉన్నాయని నిలదీశారు. తాము ఉగ్రవాదం ముప్పుతో పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశం మీదన్నారు. ఆ దేశం విధానమే ఉగ్రవాదమని, హింస అని, ఇందుకోసం అమాయక పౌరులను తప్పుదోవ పట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, కానీ భారత్​ వీటిని ఎన్నటికీ సమర్థించబోదన్నారు. పాక్​ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్​ ఇషాక్​ దార్​ లేవనెత్తిన పలు అంశాలపై పర్వతేని ఫైర్​ అవడంతో భద్రత మండలిలోని పాక్​ కు సహకరిస్తున్న పలుదేశాలు భారత ఉగ్రరూపాన్ని చూసి నీళ్లు నమిలడం విశేషం.