బాధ్యతలు చేపట్టిన సీఇసీ జ్ఞానేష్​ కుమార్​ 

CEC Gyanesh Kumar took charge

Feb 19, 2025 - 14:05
 0
బాధ్యతలు చేపట్టిన సీఇసీ జ్ఞానేష్​ కుమార్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ గా జ్ఞానేష్​ కుమార్​ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న రిజిస్టర్​ పై సంతకం చేశారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్క పౌరుడు భారత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. దేశ నిర్మాణంలో ఓటు ప్రాథమిక పాత్ర పోషిస్తుందన్నారు. భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లకు అండగా నిలుస్తుందని అన్నారు. కేరళ కేడర్​ కు చెందిన జ్ఞానేష్​ కుమార్​ ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్​ ప్యానెల్​ కు నాయకత్వం వహించనున్నారు. ఆయన మిగిలిన ఇద్దరు కమిషనర్ల కంటే సీనియర్ -ఉత్తరాఖండ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ సంధు, హర్యానా కేడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి. భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్​ గా పనిచేసిన సీఇసీ రాజీవ్​ కుమార్​ మంగళవారమే తన పదవికి రాజీనామా చేశారు. నూతన కమిషనర్ నాయకత్వంపై ఆయన తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.