భారత్​ లో 8 హెచ్​ఎంపీవీ కేసులు నమోదు!

8 HMPV cases registered in India!

Jan 7, 2025 - 12:17
 0
భారత్​ లో 8 హెచ్​ఎంపీవీ కేసులు నమోదు!

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​ లోనూ హెచ్​ ఎంపీవీ కేసులో రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం చేసిన పరీక్షల్లో మరో ఇద్దరికి పాజిటివ్​ గా తేలింది. మహారాష్ర్టలోని నాగ్​ పూర్​ లో ఈ కేసులు నమోదయ్యాయి. 13యేళ్ల బాలిక, 7యేళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో వీరిద్దరిని క్వారైంటిన్​ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్​, గుజరాత్​ లలో రెండు చొప్పున ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్​ సోకిన వారంతా చిన్నారులే కావడం గమనార్హం. అయితే ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నిత్యం పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఈ వైరస్​ బారిన పడిన వారికి భయాందోళనలు అవసరం లేదన్నారు. ఈ వైరస్​ సాధారణమైనదేనని అయినా జాగ్రత్తలు తప్పనిసరన్నారు. ఇప్పటికే నాలుగు రాష్​ర్టాల్లో ఇన్ఫెక్షన్​ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటికే ఈ దేశంలో ఈ వైరస్​ బారిన పడిన వారు ఎనిమిది మందిగా గుర్తించారు.