అసోంకు పెట్టుబడుల వరద

More of investments to Assam

Feb 25, 2025 - 19:02
 0
అసోంకు పెట్టుబడుల వరద

డీస్ఫూర్​: అడ్వాంటేజ్​ అసోం సమ్మిట్​ –2025లో పెట్టుబడుల వరద పారింది. అంతేగాక అదానీ, అంబానీ గ్రూప్​ సహా పలుప్రముఖ వ్యాపార వేత్తలు కూడా భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చారు. దీంతో అసోం పంట పండింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయా సంస్థలు పెట్టుబడుల వరదలను పారించాయి. 

అదానీ గ్రూప్​ సంస్థ రూ. 50వేల కోట్లు, రిలయన్స్​ సంస్థ రూ. 50వేల కోట్లు, టాటా గ్రూప్​ రూ. 25వేల కోట్లు, వేదాంత గ్రూప్​ రూ. 50వేల కోట్లు పెట్టుబడులను ప్రకటించాయి. ఈ బడా సంస్థలతోపాటు అనేక చిన్న సంస్థలు కూడా పెట్టుబడులను ప్రకటించాయి. 

అదానీ గ్రూప్​ (గౌతమ్​ అదానీ) విమానాశ్రయాలు, ఏరోసిటీ, సిటీ గ్యాస్​ డిస్ర్టిబ్యూషన్​ నెట్​ వర్క్​, విద్యుత్​ ప్రసారం, సిమెంట్​, రోడ్డు నిర్మాణం రంగాలలో పెట్టుబడులను పెట్టనుంది. రిలయన్స్​ గ్రూప్​ (ముఖేష్​ అంబానీ) అసోం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​, గ్రీన్​, న్యూక్లియర్​ ఎనర్టీలలో పెట్టుబడులను ప్రకటించింది. వేదాంత గ్రూప్​  (అనిల్​ అగర్వాల్​) చమురు, గ్యాస్​ లలో పెట్టుబడులను ప్రకటించింది. ఇక టాటా గ్రూప్​ (నటరాజన్​ చంద్రశేఖరన్​) ఎలక్ర్టానిక్స్​ తయారీ యూనిట్​, గ్రీన్​ ఎనర్జీ, సోలార్​ పై కప్పులు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను పెట్టనుంది. తన పెట్టుబడుల ద్వారా అసోంలో టాటా గ్రూప్​ 55వేల మందికి ఉపాధి కల్పించనుంది. అదే సమయంలో రాష్​ర్ట ప్రభుత్వంతో కలిసి 17 క్యాన్సర్​ కేర్​ ఆసుపత్రులను నిర్వహించనుంది.