మధురలో రౌడీషీటర్​ ఎన్​ కౌంటర్​

Rowdy sheeter encounter in Mathura

Mar 9, 2025 - 16:27
 0
మధురలో రౌడీషీటర్​ ఎన్​ కౌంటర్​

లక్నో: కాశీ, అయోధ్య పూర్తయ్యాయి.. ఇక మధుర వంతు అని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించిన మరుసటి రోజే మధురలో పేరుమోసిన రౌడీషీటర్ ఎన్​ కౌంటర్​ అయ్యాడు. ఆదివారం ఉదయం రౌడీషీటర్​ ఫాతి అసద్​ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు హాఫూర్​ లోని గర్​ ముక్తేశ్వర్​ కు వెళ్లారు. పోలీసులపై అసద్​ దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుదాడికి దిగగా మృతి చెందాడు. ఇతడిపై యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో 36కు పైగా కేసులు నమోదయ్యాయి. రూ. 1 లక్షల రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఎన్​ కౌంటర్​ లో అసద్ మరణించినట్లు మధుర డిఐజి శైలేష్ పాండే ధృవీకరించారు. ఇతనిపై దోపిడీ, కిడ్నాప్​, హత్య, వేధింపులకు సంబంధించి 18 కేసులు  నమోదయ్యాయి. చాలారోజుల నుంచి పోలీసులకు కనిపించకుండా, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.