మయన్మార్ లో ఆహార సంక్షోభం
చేతులెత్తేసిన ఐక్యరాజ్యసమితి

నేపిడా: మయన్మార్ లో మరోమారు ఆహార సంక్షోభం వైపు పరిస్థితులు దారి తీసే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి పది లక్షల మందికి ఆహారం అందించే సహాయాన్ని నిలిపివేస్తున్న శుక్రవారం ప్రకటించింది. వచ్చే నెల నుంచి డబ్ల్యూఎఫ్ పీ (వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్)కు ఫుల్ స్టాప్ పెట్టనున్నామని ప్రకటించింది. అంతర్జాతీయ ఆహార సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వెల్లడించింది. 2021 నుంచి పౌర ప్రభుత్వం తొలగించాక మయన్మార్ లో ఆకలి సంక్షోభంలో కూరుకుపోయింది. 15.2 మిలియన్ల జనాభాలో మూడింట ఒక వంతు జనాభా తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఐక్యరాజ్యసమితికి కూడా అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఆర్థిక సహాయం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు, సమీక్ష అనంతరం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది తెలియరాలేదు. ఇప్పటికే మయన్మార్ లో పలు కమ్యూనిటీలు ఆహార, ఆర్థిక, నిరుద్యోగ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో మైనార్టీ రోహింగ్యా ముస్లిం కమ్యూనిటీలు లక్షలాది మంది ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఆ దేశం నుంచి ఇతర దేశాలకు మరిన్ని వలసలు పెరిగే అవకాశం పొంచి ఉంది.