ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు
Prime Minister Modi wishes Ramzan

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం విలసిల్లాలని కోరారు. పవిత్ర మాసం రంజాన్ భక్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కరుణ, దయ లాంటి విలువలను సమాజానికి తెలియజేస్తుందని మోదీ చెప్పారు. భారత్ లో ఆదివారం నుంచి రంజాన్ నెల ఆరంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఆదివారం నుంచి పర్వదినం ప్రారంభమైనట్లు ప్రకటించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం, మానవాళికి సేవ చేయడం వంటి సద్గుణ కార్యాలు రంజాన్ మాసానికి ప్రతీక అని అభివర్ణించారు. పవిత్ర మాసంలో స్వీయ క్రమశిక్షణ, సహనం, ఆరాధన వంటి మంచి పనులతో సోదరభావంతో విలువలను పెంపొందించుకోవాలని సీఎం యోగి పేర్కొన్నారు.