ప్రాంతీయ శాంతికి అడ్డంకి పాక్
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రాంతీయ శాంతికి పాకిస్థాన్ అతిపెద్ద అడ్డంకి అని వెంటనే భారత భూభాగాలను ఖాళీ చేయాలని భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమండ్ చేశారు. ప్రధానమంత్రి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలపై పాక్ స్పందనపై మండిపడ్డారు. మంగళవారం ఆయన ప్రకటన విడుదలలో పాక్ ను తూర్పారబట్టారు.
పాకిస్థాన్ ఒక ఉగ్రవాద దేశమని, చట్టవిరుద్ధంగా భారత భూభాగాన్ని ఆక్రమించిందని, అసత్యాలు, అవాస్తవాలు వ్యాపింప చేస్తుందని మండిపడ్డారు. వెంటనే తమ భూభాగాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ పై పాక్ వ్యాఖ్యలు పాక్ సమస్య ఎలా అవుతుందని నిలదీశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్ధతు పలుకుతున్నదెవరో? ప్రపంచానికి తెలుసన్నారు. పాక్ వల్ల ప్రాంతీయ శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు.
కాగా అమెరికా ఇంటలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బర్డ్ మీడియాతో మాట్లాడుతూ భారత్, అమెరికాలను ప్రభావితం చేస్తున్న అనేక ఉగ్రవాద దేశాలున్నాయని అన్నారు. అవే ఇస్లామిక్ ఉగ్రవాద దేశాలను పరోక్షంగాపాక్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో తులసీ గబ్బర్డ్ తో ప్రధానమంత్రి మోదీ సమావేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సముద్ర, సైబర్ భద్రతలో సహకారాన్ని పెంపొందించేందుకు భారత్–అమెరికా కట్టుబడి ఉన్నాయని అంగీకరించారు. ఉగ్రవాదంపై పోరాటానికి ఇరుదేశాల సహకారానికి ఉన్న వివిధ అవకాశాలను ప్రధాని మోదీ గబ్బర్డ్ తో చర్చించారు.