సరిహద్దులో పాక్​ కాల్పులు

భారత కాల్పుల్లో ఐదుగురు పాక్​ జవాన్లు మృతి

Feb 13, 2025 - 12:59
 0
సరిహద్దులో పాక్​ కాల్పులు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ పూంచ్​ జిల్లా బాలాకోట్​ సెక్టార్​ సరిహద్దులో భారత స్థావరాలపై పాక్​ సైన్యం కాల్పులకు పాల్పడింది. ప్రతీకార చర్యగా భారతసైన్యం ధీటుగా సమాధానం ఇవ్వడంతో 4 నుంచి ఐదుగురు పాక్​ సైనికులు మృతిచెందినట్లు తెలుస్తుంది. గురువారం వేకువజామున పాక్​ సరిహద్దు వైపు నుంచి ఉన్నట్లుండి ఆర్మీ పోస్టులపై కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ ఓ వైపు చొరబాట్లపై నిఘా పెడుతూనే మరోవైపు వారికి ధీటైన సమాధానం ఇచ్చింది. పాక్​ సరిహద్దుల వెంట కుట్రలపై జమ్మూకశ్మీర్​ ఎల్జీ గవర్నర్​ మనోజ్​ సిన్హా ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించనున్నారు.