ఒక రోజు ఆప్​ నేతల సస్పెండ్​ ఢిల్లీ అసెంబ్లీలో కాగ్​ నివేదిక

One day suspension of AAP leaders in Delhi assembly CAG report

Feb 25, 2025 - 12:41
 0
ఒక రోజు ఆప్​ నేతల సస్పెండ్​ ఢిల్లీ అసెంబ్లీలో కాగ్​ నివేదిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గందరగోళం నడుమ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆప్​ పార్టీ నేతలు ఉదయం నుంచే అసెంబ్లీలో నిరసనలు చేస్తూ లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ వీకే సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో స్పీకర్​ విజయేందర్​ గుప్తా అతిషి సహా 13 మంది ఎమ్మెల్యేలను సమావేశాలను నుంచి ఒక్కరోజు కోసం సస్పెండ్​ చేశారు. దీంతో అసెంబ్లీ బయటే ఆప్​ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మద్యం విధానంపై కాగ్​ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆప్​ అనుసరించిన తప్పుడు మద్యం విధానాల వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,026 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. కాగా లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ ఆయుష్మాన్​ భవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 
కాగ్​ నివేదికలో ఏముంది..
– 2021 మార్చి ఆర్థిక శాఖ ఆడిటింగ్​ రిపోర్టు సమర్పించలేదు.
‌‌– 2020, 2021 రెవెన్యూ, ఎకానమీ, సోషల్​, జనరల్​ సెక్టార్​, పీఎస్​ యూ రిపోర్టులను సమర్పించలేదు.
– 2022 ఆడిటింగ్​ సమర్పించలేదు.
– మద్యం కేటాయింపులపై ఆడిటింగ్​ రిపోర్టు సమర్పించలేదు.
– 2023 ఆర్థిక శాఖ ఆడిటింగ్​ రిపోర్టు సమర్పించలేదు.
– పబ్లిక్​ హెల్త్​, ఇన్​ ఫ్రాస్ర్టక్చర్​, ఆరోగ్య సేవలు, మేనేజ్​ మెంట్​ వంటి ఆడిటింగ్​ రిపోర్టు సమర్పించలేదు.
ఇంకా అనేక విషయాలపై ఆప్​ ప్రభుత్వ పాలనను కాగ్​ ఈ నివేదికలో ఎండగట్టింది.