అమెరికాలో మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం
Red carpet welcome to Modi in America

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత కాలమాన ప్రకారం గురువారం వేకువజామున 4.30 గంటలకు అమెరికాకు చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అధికారికంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్తో సమావేశమయ్యారు. సీఐఎ, ఎన్ ఎస్ఎ, సహా 18 నిఘా సంస్థలకు ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబ్బర్డ్ నియామకాన్ని అమెరికా పార్లమెంట్ ఎగువ సభ ఆమోదించింది. ప్రధాని గబ్బర్డ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, కొత్తగా తలెత్తే ముప్పులపై పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు చర్చించారు.
మోడీ ప్రతినిధి బృందం ఆరు సమావేశాలలో హాజరుకానుంది. మోదీ, ట్రంప్ మధ్య సమావేశం భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి (శుక్రవారం తెల్లవారుజామున) 2.30 గంటల ప్రాంతంలో 45 నిమిషాలపాటు కొనసాగనుంది. 14 వేకువజాము 3.40 గంటలకు వైట్ హౌస్ లో మీడియాతో కూడా సంభాషించనున్నారు. అనంతరం ట్రంప్ ఏర్పాటు చేసే విందులో ప్రధాని మోదీ సహా ఇరుదేశాల మంత్రులు, విదేశాంగ శాఖాధికారులు, ప్రతినిధులు పాల్గొంటారు. వాతావరణం, భద్రత, వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగాలు, ఎఐ సాంకేతికత, సుంకాలు, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన నిందితుల అప్పగింత, అక్రమ వలసలపై ఇరువురి మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా ప్రధాని మోదీ అమెరికా చేరుకున్న తరువాత ఆయనకు ప్రముఖ బ్లెయిర్ హౌస్ లో బస కల్పించారు. ఈ నివాసానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. నాలుగు అంతస్థులు గల ఈ బ్లెయిర్ హౌస్ లో 119 గదులు, 14 బెడ్రూమ్లు 70వేల చ.అ. విశాల ప్రాంగణంలో నిర్మించారు.