కొనసాగుతున్న బలూచ్ ఆపరేషన్
ఆపరేషన్ పూర్తి.. అవాస్తవమే

ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం బలూచ్ ట్రైన్ హైజాక్ ఆపరేషన్ ముగించేశామని ప్రకటించడం పూర్తిగా అవాస్తవమేనని తెలుస్తుంది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ఆపరేషన్ గురువారం కూడా కొనసాగుతుంది. పాక్ సైన్యం చేస్తున్న ఆరోపణలు బలూచ్ ఆర్మీ తిప్పికొట్టింది. ఇంకా ఆపరేషన్ ముగియలేదని, తమవద్దే 150 మంది ఆర్మీ జవాన్లు బందీలుగా ఉన్నట్లు ప్రకటించింది. పాక్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని పలు ఆధారాలు కూడా ప్రవేశపెట్టింది. పాక్ ప్రభుత్వం తమ డిమాండ్లపై సీరియస్ గా లేదని మండిపడింది. కాగా ఆపరేషన్ పూర్తయ్యిందని ప్రకటించినా ఆ ప్రాంతం గుండా ఇంకా రవాణా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించడం లేదు. ఈ పూర్తి ఆపరేషన్ పూర్తయ్యిందనే వీడియోను ఇంకా ఎందుకు విడుదల చేయలేదు. ఆపరేషన్ పూర్తయ్యిందంటూ పలువురు జర్నలిస్టులను అక్కడి పంపి పలువురు బీఎల్ ఎకు చెందిన వారి మృతదేహాల చిత్రాలను విడుదల చేస్తూ ఆపరేషన్ పూర్తయ్యిందని ప్రకటించింది. కానీ ఫ్యాక్ట్ చెక్ లో ఆ చిత్రాలు పాతవని తేలింది. క్వెట్టాకు 200 శవపేటికలు తీసుకువెళ్లినా వీటిపై సరైన సమాధానం ఇవ్వలేక దాటవేత ధోరణి కనిపించింది. బీఎల్ ఎ బందీలుగా ఉన్న అందరి పేర్లను విడుదల చేసింది. కానీ పాక్ సైన్యం ఆపరేషన్ పూర్తి అయినా ఎందుకు పేర్లు అధికారికంగా విడుదల చేయలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.