నక్సల్స్ కోటకు బీటలు!
Naxals' stronghold is beaten!

భారీ ఆపరేషన్లతో నక్సల్స్ నుంచి విముక్తి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: నక్సల్స్ కంచుకోటకు బీటలు వారాయి. బస్తర్ కోటలు రక్తపు మరకలతో ఎరుపెక్కాయి. గత కొన్ని రోజులుగా నక్సల్స్ కు భద్రతా దళాలకు జరుగుతున్న పోరులో భారీ ఎత్తున నక్సల్స్ ఎన్ కౌంటర్లలో మృతి చెందుతున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సత్ఫలితాలనిస్తున్నా, ఇంతపెద్ద ఎత్తున ప్రాణాలు పోవడం పట్ల పలువురికి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ వల్ల కర్ణాటక పూర్తి నక్సల్స్ రహిత రాష్ర్టంగా ప్రకటించారు. చత్తీస్ గఢ్ లోని బస్తర్ కోటను బద్ధలు కొడితే అన్ని రాష్ర్టాల్లోని నక్సల్స్ ఆపరేషన్ లు పూర్తిగా నిలిపివేస్తారనే ఆపరేషన్ కు అంకురార్పణ చుట్టి బస్తర్ నే భద్రతా బలగాలు టార్గెట్ గా చేసుకున్నాయి. దీంతో కేంద్రం గతేడాదిగా చేపడుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భారీ సంఖ్యలో నక్సల్స్ బడా నాయకులు, కమాండర్లు, ఆయా రాష్ర్టాల నక్సలైట్లు మృతి చెందారు. ఎంతోమంది లొంగిపోయారు. ఈ ఆపరేషన్ లో ఓ వైపు చత్తీస్ గఢ్ లోని నక్సల్స్ కు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధిచేస్తూ స్థానిక గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అభివృద్ధికి స్థానిక గ్రామీణ వాసులు ప్రాధాన్యతనిస్తుండడంతో నక్సల్స్ కు భారీ ఎదురు దెబ్బలు తప్పడం లేదు. దీంతో వారి నెట్ వర్క్ పూర్తిగా దెబ్బతింది. కాగా కేంద్రం చేపట్టిన ఈ ఆపరేషన్ లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తుండడంతో నక్సలైట్ల కదలికలను నిఘా వర్గాలు ముందే గుర్తించగలుగుతున్నాయి. అదీగాక సమాచారం అందిన వెంటనే అలక్ష్యం చేయకుండా నిఘా వర్గాలను సైతం అప్రమత్తం చేస్తూ ఒకేసారి భారీ భద్రతా బలగాలతో చుట్టుముడుతుండడంతో నక్సల్స్ కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. సాంకేతికత సహాయంతో చత్తీస్ గఢ్ ను పూర్తి నక్సల్స్ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని కేంద్రం ప్రకటించింది.
2025లో..
2025 ఫిబ్రవరి 9న జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.
జనవరి 5న జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మృతి చెందారు.
జనవరి 16న ఉసూర్ బ్లాక్ లోని పూజారి కాంకేర్ లో 18 మంది మృతి చెందారు.
జనవరి 21న గరియాబంద్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మృతి చెందారు.
2024లో..
మార్చి 27న బీజాపూర్ జిల్లా చీపురభట్టిలో ఇద్దరు నక్సల్స్ మృతి.
ఏప్రిల్ 2న బీజాపూర్ గంగాలూరులో 13 మంది మృతి.
ఏప్రిల్ 6న తెలంగాణ–చత్తీస్ గఢ్ సరిహద్దులో ఎన్ కౌంటర్ లో ముగ్గురు మృతి చెందారు.
ఏప్రిల్ 16న 29 మంది మృతి.
ఏప్రిల్ 30న 10 మంది మృతి.
మే 10న బీజాపూర్ పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది నక్సల్స్ హతమయ్యారు.
మే 23, 24 తేదీలలో నారాయణ్ పూర్, అబూజ్ మడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8మంది మృతి చెందారు.
మే 25న సూక్మా, బీజాపూర్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మృతి చెందారు.
జూన్ 8న అబూజ్ మడ్ అమ్దాయ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు.
జూన్ 15న నారాయణ్ పూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 8మంది మృతి.
సెప్టెంబర్ 3న దంతేవాడ – బీజాపూర్ సరిహద్దు లో 9మంది నక్సల్స్ మృతి చెందారు.
సెప్టెంబర్ 5న చత్తీస్ గఢ్– తెలంగాణ సరిహద్దులో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు.
అక్బోర్ 4 తుల్ తులీ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో 38 మంది నక్సల్స్ మృతి చెందారు.
నవంబర్ 22న సూక్మా థానా బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మృతి చెందారు.