హమాస్ పై భీకర దాడులు.. 326 మంది మృతి!
Fierce attacks on Hamas.. 326 people killed!

గాజా సిటీ: ఇజ్రాయెల్ మరోమారు గాజాలో హమాస్ స్థావరాలపై విరుచుకుపడింది. మంగళవారం వేకువజామున భారీ వైమానిక దాడులను చేసింది. ఈ దాడుల్లో 326 మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు ముందుకు సాగించనందున, తమ బందీలను విడిచిపెట్టినందున హమాస్ నరకపు తలుపులను మరోమారు తెరుస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. జనవరి 19న కాల్పుల విరమణ తరువాత ఐడీఎఫ్ గాజాలో చేపట్టిన అతిపెద్ద దాడి ఇదే. అంతేగాక గత వారం రోజులుగా గాజాకు ఆహారం, మందులు, ఇంధనం, సామాగ్రి సరఫరాను కూడా ఇజ్రాయెల్ నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను హమాస్ అంగీకరించాలని డిమాండ్ చేస్తుంది. కాగా దాడులపై గాజా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరం మంటల్లో చిక్కుకుందన్నారు. కాగా ఈ దాడులను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య కాల్పుల విరమణ కిందకే వస్తుందని, పైగా ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని, రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతున్నారని హమాస్ హెచ్చరించింది.
కాగా తొలిదశ కాల్పుల విరమణలో భాగంగా 33 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయగా, రెండువేల మంది బందీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. మార్చి 1న కాల్పుల విరమణ ముగిసింది. ఇంకా 59 మంది బందీలు హమాస్ వద్ద ఉన్నారని, అందులో 24 మంది బతికే ఉన్నారని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో పలుమార్లు బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా హెచ్చరించారు. అంతేగాక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హమాస్ కు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాడు.
కాగా ఇజ్రాయెల్ దాడులతో మరోమారు భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు గాజాను వీడి వెళుతున్నారు.