మిల్కీపూర్​ గెలుపు ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు

ఎస్పీ నాయకుడు అవదేశ్​ ప్రసాద్​

Feb 9, 2025 - 14:09
 0
మిల్కీపూర్​ గెలుపు ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు

లక్నో: యూపీ మిల్కీపూర్​ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఎస్పీ ప్రముఖ నాయకుడు అవదేశ్​ ప్రసాద్​ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందారని ఆరోపించారు. ఎన్నో ఎన్నికలను చూశామని, ఎన్నికల కమిషన్​ పై ఏం ఒత్తిడి ఉందో తెలియదని, బీజేపీకి అనుకూలంగానే ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. కాగా మిల్కీపూర్​ నుంచి బీజేపీ తరఫున చంద్రభాను పాశ్వాన్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈయనకు పోటీగా సమాజ్​ వాదీ పార్టీ నుంచి అజిత్​ ప్రసాద్​ రంగంలో ఉన్నారు. పాశ్వాన్​ 1,46,397 ఓట్లు లభించగా, ప్రసాద్​ కు 84,687 ఓట్లు మాత్రమే లభించాయి. పాశ్వాన్​ 61వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.