ఐఎస్​ఐ ఏజెంట్​ అరెస్ట్​!

పాక్​ చేతికి డ్రోన్లు, గగన్​ యాన్​ సమాచారం

Mar 14, 2025 - 13:42
 0
ఐఎస్​ఐ ఏజెంట్​ అరెస్ట్​!

లక్నో: యూపీ ఫిరోజాబాద్​ ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీకి చెందిన కీలక సమాచారాన్ని పాక్​ ఐఎస్​ఐతో పంచుకుంటున్న ఐఎస్​ ఐ ఏజెంట్​ ను యూపీ ఏటీఎస్​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.  డ్రోన్లు, గగన్​ యాన్​ లాంటి కీలక ప్రాజెక్టుల విషయాలను పాక్​ ఐఎస్​ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించారు. రవీంద్ర కుమార్​ ను ఆగ్రా నుంచి అరెస్టు చేశారు. నేహా శర్మ అనే మహిళ ట్రాప్​ లో పడ్డ ఇతను డబ్బుకు ఆశపడి ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని గత కొంతకాలంగా వాట్సాప్​ ద్వారా ఆమెకు చేరవేస్తున్నాడు. దీన్ని పసిగట్టిన యూపీ ఏటీఎస్​ నేహా శర్మ పేరుతో పాక్​ ఐఎస్​ఐ నకిలీ అకౌంట్​ తో ఇతన్ని ట్రాప్​ చేశారని గుర్తించింది. వలపన్ని రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? కీలక ప్రాజెక్టుల విషయం ఫోన్​ లోకి ఎలా చేరింది. తదితర అంశాలపై ఏటీఎస్​ అధికారులు రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.