పాక్​ లో ఉగ్రదాడి.. ఐదుగురు మృతి

Five killed in terrorist attack in Pakistan

Feb 2, 2025 - 17:23
 0
పాక్​ లో ఉగ్రదాడి.. ఐదుగురు మృతి

ఇస్లామాబాద్​: పాకిస్థాన్​ లోని ఖైబర్​ ఫంక్తుక్వా ప్రావిన్స్​ లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు జవాన్లు సహా ఒక పౌరుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం పెషావర్​ లోని దక్షిణ వజీరిస్థాన్​ సరిహద్దు డేరా ఇస్మాయిల్​ ఖాన్​ జిల్లాలో ఈ దాడి జరిగినట్లు పాక్​ పోలీసులు తెలిపారు. మిలటరీ ట్రక్కును ఉగ్రవాదులు దొంగతనం చేశారు. ఈ వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పారామిలటరీ బలగాలు ప్రయత్నించి దాడికి గురైనట్లు వివరించారు. దాడిలో ఒక సాధారణ పౌరుడు కూడా మరణించినట్లు తెలిపారు. ఖైబర్​ ఫంక్తుక్వాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు పాక్​ పెద్ద ఎత్తున ఆపరేషన్​ ను చేపట్టింది. శనివారం వరకూ నిర్వహించిన ఆపరేషన్​ లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అలర్టయ్యారు. సైన్యం నుంచి తప్పించుకుంటూ దాడులకు తెగబడుతున్నారు.