వీహెచ్​ పీ నేతపై కాల్పులు

అడ్డుకున్న కుమారుడిపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు

Feb 2, 2025 - 18:10
 0
వీహెచ్​ పీ నేతపై కాల్పులు

లక్నో: యూపీలోని సుల్తాన్​ పూర్​ లో విశ్వహిందూ పరిషత్​ నాయకుడు, ఆయన కుమారుడిపై కాల్పులు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ దాడి వివరాలను పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సుల్తాన్​ పూర్​ లోని కడిపూర్​ కొత్వాలి ప్రాంతంలో కత్సరి గ్రామానికి చెందిన వీహెచ్​ పీ నాయకుడు సత్యేంద్ర మిశ్రా (48)పై పొరుగునే ఉన్న వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తన కుమారుడు హృతిక్​ అ చర్యను అడ్డుకునేందుకు రాగా, నిందితుడు అతడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి తండ్రి, కుమారులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులఘటనపై కడిపూర్​ పోలీస్​ స్టేషన్​ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు చర్యలు తీసుకున్నారు.