హిమపాత ప్రమాదం.. మేజిస్టీరియల్​ విచారణకు ఆదేశం

Avalanche accident.. Order for magisterial inquiry

Mar 4, 2025 - 13:55
 0
హిమపాత ప్రమాదం.. మేజిస్టీరియల్​ విచారణకు ఆదేశం

డెహ్రాడూన్​: బ్రదీనాథ్​ చమోలీ హిమపాతం ప్రమాదంపై ఆ రాష్ర్ట ప్రభుత్వం మేజిస్ట్రేట్​ దర్యాప్తునకు ఆదేశించింది. మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో జోషిమఠ్​ ఎస్టీఎంను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఫిబ్రవరి 28న జరిగిన హిమపాతం ప్రమాదంపై చమోలీ జిల్లా మేజిస్ట్రేట్​ సందీప్​ తివారీ విచారణకు ఆదేశించారు. 54 మంది కార్మికుల్లో 46 మందిని సురక్షితంగా కాపాడారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తప్పిపోయిన నలుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంతో రెస్క్యూ చర్యలు పూర్తయ్యాయి. కాగా ప్రమాదానికి పూర్తి కారణాలు, భవిష్యత్​ లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే ముందే అలర్ట్​ జారీ చేయడం లాంటివి, ఇలాంటి చోట్ల పనులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన నివేదికను విచారణ అనంతరం ఎస్డీఎం ప్రభుత్వానికి, కోర్టుకు సమర్పించనున్నారు.