మార్చి 19న భూమికి వ్యోమగాములు!
Astronauts to Earth on March 19th!

విజయవంతమైన క్రూ 10 ప్రయోగం
9 నెలల తరువాత రానున్న సునీతా, బుచ్ లు
కెన్నడీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మార్చి 19న తిరిగి రానున్నారు. ఎలోన్ మస్క్ కు చెందిన పాల్కన్ 9ని విజయవంతంగా ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఇందులో నలుగురు వ్యోమగారులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్ కు ‘క్రూ 10’ అని పేరు పెట్టారు. 8 రోజుల ఐఎస్ఎస్ పర్యటనకు వెళ్లిన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ లో 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీరిని సురక్షితంగా తీసుకురావాలని సంకల్పిస్తూ ఈ పనిని ఎలోన్ మస్క్ కు పురమాయించింది. దీంతో ఎలోన్ మస్క్ సంస్థ పనులు ప్రారంభించి సునీతా, బుచ్ లను భూమిపైకి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పలుమార్లు ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగంలో విఫలమైనా చివరకు విజయం సాధించింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు నాలుగు రోజుల తరువాత భూమిని తిరిగి రానున్నారు. అన్నే మెక్క్లెయిన్, నికోల్ ఐరెస్, జపనీస్ అంతరిక్ష సంస్థకు చెందిన టకుయా ఒనిషి, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.