214మంది పాక్​ జవాన్లను చంపేశాం!

పోరాటం ముగిసిపోలేదన్న బీఎల్​ ఎ

Mar 15, 2025 - 14:04
 0
214మంది పాక్​ జవాన్లను చంపేశాం!

ఇస్లామాబాద్​: జాఫర్​ ఎక్స్​ ప్రెస్ రైలు హైజాక్​ లో పాక్​ ప్రభుత్వం వ్యవహరించిన మొండితీరుతో బందీలుగా ఉన్న 214 మందిని చంపివేశామని బీఎల్​ ఎ శనివారం ప్రకటించింది. తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదని ప్రకటన విడుదల చేసింది. పాక్​ సైన్యానికి 48 గంటల పాటు హెచ్చరిక జారీ చేసినా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించిందే గానీ, తమ బందీల ప్రాణాలు ఏమవుతాయన్నది ఆలోచించకుండా దురహంకారాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు. దీంతో తాము తీసుకున్న చర్యల్లో 214 మంది బందీలు హతమయ్యారని పేర్కొంది. బీఎల్​ ఎ యుద్ధ సూత్రాలకు, అంతర్జాతీయ చట్టాలకు లోబడే వ్యవహరించిందన్నారు. ఈ పోరులో 12మంది బీఎల్​ ఎ సమరయోధులు కూడా నేలకొరిగారని వారికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ పాక్​ బందీల మృతదేహాల కోసం వెతుకుతుందని చెప్పారు. ఏది ఏమైనా తాము చేపట్టిన ఆపరేసన్​ ‘దర్రా ఎబోలన్​’ సక్సెస్​ అయిందని ప్రకటించింది.