బోస్ ఫౌండేషన్ ఆస్తులు నెహ్రూ వశం?
Are the assets of the Bose Foundation owned by Nehru?

ఆదేశాల మేరకు నిధులు హస్తగతం
రామమూర్తి, అయ్యర్ కీలకపాత్ర
అనేక నివేదికలు, పుస్తకాల్లో స్పష్టమైన ఆధారాలు
తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగం అంశం మరోమారు తెరపైకి వస్తుంది. 1951 నుంచి 1955 మధ్య భారత్–జపాన్ మధ్య జరిగిన చర్చల్లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. హింద్ ఫౌజ్ నిధులు ఏడు లక్షల డాలర్లు. వీటి దుర్వినియోగంపై అనుజ్ ధార్ 2012లో ‘ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్ అప్’ పుస్తకంలో కీలక విషయాలను రాశారు. అంతేగాక నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అయ్యర్ పంచవర్ష ప్రణాళికలో సలహాదారుగా నెహ్రూ నియమించారు. ఈ విషయాన్ని నేషనల్ ఆర్కైవ్స్ రహస్య ఫైళ్లు కూడా వెల్లడిస్తున్నాయి. నేతాజీకి అత్యంత దగ్గరి సహచరులైన రామమూర్తి, అయ్యర్ లపై నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలున్నాయి. నేతాజీ ఫౌండేషన్ వద్ద ఉన్న ఆస్తులే గాక ఆయన సొంత ఆస్తులు కూడా భారీ మొత్తంలో ఆయన మరణం తరువాత దుర్వినియోగం, కనబడకుండా పోయాయి.
1951లో జపాన్ ప్రభుత్వం అందించిన రహాస్య సమాచారం గురించి కొందరు బయటపెట్టారు. బోస్ వద్ద పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. కానీ ఆయన జపాన్ వెళ్లేటప్పుడు విమానంలో కేవలం రెండు సూట్ కేసులను మాత్రమే అనుమతించారు. ఆ విమానంలో ప్రయాణిస్తూనే బోస్ ప్రమాదానికి గురయ్యారు. నేతాజీ నిధి అంతా అయ్యర్ గదిలో భారీ పెట్టెల్లో ఉండేదని ప్రస్తావించారు. నేతాజీ మరణం తరువాత ఫౌండేషన్ నిధులపై విచారణ జరగ్గా కేవలం 300 గ్రాముల బంగారం, రూ. 260 నగదు మాత్రమే లభించింది. మిగతా భారీ నిధి ఏమైందనేది ఇప్పటికీ మిస్టరీగానే మారిందని 1955 నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతీ విషయం ప్రధాని నెహ్రూకు తెలుసని కూడా ఆయన ఆదేశాలతోనే నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలను కూడా ఈ నివేదిక చేసింది. ఆ తరువాత అయ్యర్, రామమూర్తిలో బాగా అభివృద్ధి చెందారు. ఢిల్లీకి వచ్చిన అయ్యర్ ను నెహ్రూ స్వాగతించారు. 1953 పంచవర్ష ప్రణాళిక కార్యక్రమానికి ప్రచార సలహాదారుగా కూడా నియమించారు.
ఏది ఏమైనా ఇప్పటికీ ఈ ఆస్తులు ఏమయ్యాయనే దానిపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ స్పష్టంగా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఆదేశాల మేరకే ప్రతీది జరిగినట్లు అనుమానాలున్నాయి. నేతాజీ ఫౌండేషన్ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది.