సంగమంలో స్నానమాచరించిన అంబానీ కుటుంబం

Ambani family bathed in Sangam

Feb 11, 2025 - 19:55
 0
సంగమంలో స్నానమాచరించిన అంబానీ కుటుంబం

లక్నో: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్​ అంబానీ కుటుంబం ప్రయాగ్​ రాజ్​ లోని మహాకుంభమేళాలో మంగళవారం పుణ్య స్నానాలాచరించారు. కుమారుడు అనంత్​, కోడలు రాధికా మర్చంట్​, తల్లి కోకిలాబెన్​ లు మహాకుంభమేళాకు చేరుకొని సంగమంలో స్నానం చేశారు. ప్రయాగ్​ రాజ్​ లో 30వ రోజు సాయంత్రం 6 గంటల వరకు 1.23 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 45.85 కోట్లకు స్నానాలాచరించిన వారి సంఖ్య చేరుకుందన్నారు. అంతేగాక సెక్టార్​ 17 శక్తిధామ్​ లో 68 మంది విదేశీ భక్తులు సనాతన ధర్మాన్ని స్వీకరించారని అధికారులు వివరించారు. కాగా ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా పుణ్య స్నానాలాచరించే భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు.