దల్లేవాల్ నిరసనపై మొండిపట్టుదలొద్దు
Don't insist on Dallewal's protest

సహచర రైతులను మందలించిన సుప్రీం కోర్టు
ముందుగా ఆసుపత్రిలో చికిత్స అందించాలి
అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖనౌరీ సరిహద్దులో నిరసన చేపడుతున్న రైతులను సుప్రీం కోర్టు మందలించింది. ఓ వైపు రైతు క్షేమాన్ని కోరే జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు విషయమిస్తుంటే సహచర రైతులు మొండిపట్టుదలకు పోవడం సరికాదని పేర్కొంది. శనివారం పంజాబ్, హరియాణా సరిహద్దు ఖనౌరీలో చేపట్టిన రైతు జగ్జీత్ సింగ్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు రైతులు పోలీసులకు, వైద్యులకు సహకరించాలని స్పష్టం చేసింది. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చేందుకు పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 31వ తేదీ వరకు గడువు విధించింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన ఆసుపత్రిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని న్యాయమూర్తి పంజాబ్ చీఫ్ సెక్రెటరీకి సూచించారు. పంజాబ్ కు సహాయం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలని సూచించింది. నవంబర్ 26 నుంచి దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చొన్నారు. ఆయన దీక్ష నెల దాటిపోయింది. దీంతో దల్లేవాల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. రోజురోజుకు ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.