విలువలతో కూడిన బంధాలు

మారిషస్​ లో ప్రధాని మోదీ

Mar 12, 2025 - 13:22
 0
విలువలతో కూడిన బంధాలు

జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు
క్లిష్టపరిస్థితుల్లోనూ ఒక్కటిగా నడిచాం
ప్రధాని నవీన్​ చంద్రతో భేటీ
బలమైన భాగస్వామ్యానికి పునాది వేస్తాం

పోర్ట్​ లూయిస్​: భారత్​–మారిషస్​ మధ్య సాంస్కృతి సంప్రదాయాలు, విలువలతో కూడి ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహాసముద్రంతోపాటు అనే ప్రాంతాలతో భారత్​ కు ప్రత్యేక బంధం ఉందన్నారు. ఒకదేశం కోసం మరో దేశం ఎప్పుడూ సహాయకారిగా నిలిచిందని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్​ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇరుదేశాలు ఒక్కటిగా ఉన్నాయని స్పష్టం చేశారు. 

57వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
మారిషస్​ 57వ జాతీయ దినోత్సవం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవంలో పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వేడుకల్లో పాల్గొనడం తమ దేశ గౌరవాన్ని మరింత పెంచిందని మారిషస్​ ప్రధాని నవీన్​ చంద్ర రామ్​ గులాం అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న విశిష్ఠమైన, ప్రత్యేకమైన బంధాలకు నిదర్శనమని కొనియాడారు.

ఆయా రంగాల్లో సహకారం..
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజల మధ్య సంబంధాలు ఇరుదేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిని వేస్తాయన్నారు. డిజిటల్​ హెల్త్​, ఆయుష్​ కేంద్రాలు, పాఠశాల విద్య, నైపుణ్యాల్లో సహకారం కొనసాగుతుందన్నారు. ఎఐ, డీపీఐ డిజిటల్​ ఇన్​ఫ్​రాస్ర్టక్చర్​ ను ఉపయోగించడానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయన్నారు. చార్​ ధామ్​ యాత్ర, రామాయణ ఇతిహాస స్థలాల సందర్శన కోసం ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. 

ప్రధానితో భేటీ..
ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్​ ప్రధాని నవీన్​ చంద్ర రామ్​ గులంతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. మారిషస్​ లో నూతన పార్లమెంట్​ భవన నిర్మాణంలో భారత్​ సహకారం అందించనుంది. మెట్రో ఎక్స్​ ప్రెస్​ వే, సుప్రీంకోర్టు భవనం,గృహ నిర్మాణం, ఈఎన్​ టీ ఆసుపత్రి, పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించాలని మోదీ నిర్ణయించారు. యూపీఐ, రూపేల ద్వారా చెల్లింపులను సరళతరం చేయనున్నారు. జనౌషధి కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయించారు. 

అనంతరం ప్రధాని మోదీ మాజీ ప్రధాని ప్రవింద్​ జుగ్నాథ్​, 
 పోర్ట్​ లూయిస్​ మారిషస్​ ప్రతిపక్ష నాయకుడు జార్జెస్​ పీయరీ లెస్జోంగార్డ్​ లతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రధానితోపాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​, ఎన్​ఎస్​ ఎ చీఫ్​ అజిత్​ ధోవల్​ లు కూడా పాల్గొన్నారు.