యూఎస్​ఎఐడీ నిధులు.. ట్రంప్​ వ్యాఖ్యలు ఆందోళనకరం

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​

Feb 21, 2025 - 16:21
 0
యూఎస్​ఎఐడీ నిధులు.. ట్రంప్​ వ్యాఖ్యలు ఆందోళనకరం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యూఎస్​ఎఐడీ నిధులు అందాయన్న ట్రంప్​ వ్యాఖ్యలపై శుక్రవారం భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్​ జై స్వాల్​ స్పందించారు. ఈ విషయం ఆందోళనకలిగిస్తుందన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్​ వ్యాఖ్యలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని, పూర్తి ఆధారాల తరువాతే మిగతా విషయాలను వెల్లడిస్తామన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా బహిరంగ వ్యాఖ్యల వల్ల తమ దర్యాప్తులో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని, నిధులు అందుకున్న వారు అలర్ట్​ అవుతారని అన్నారు. 21 మిలియన్​ డాలర్లు యూఎస్​ ఎఐడీ ద్వారా ఎలా అందిందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు జైస్వాల్​ చెప్పారు.