అమెరికాలో టోర్నోడో బీభత్సం
34 మంది మృతి, 50 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికా మిస్సౌరీలో భారీ తుపాను సంభవించింది. ఈ తుపాను కారణంగా 34 మంది మృతి చెందారు. టోర్నడో (సుడిగాలి)తో కూడిన ఈ తుపానులో వేలాది ఇళ్లపైకప్పులు ఎగిపోయాయి. మిస్సౌరీలోని బేకర్స్ ఫీల్డ్ లో ఒక్కసారిగా సంభవించిన తుపానుతో భారీ నష్టం సంభవించింది. తుపాను కారణంగా వివిధ ప్రాంతాల్లో 34 మృతిచెండగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇళ్లు ధ్వంసం, విద్యుత్ లైన్లు, చెట్లు కూలిపోవడం, పరిసరాల్లో ఉన్న వాహనాలు గాలికి కొట్టుకుపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఆర్కాన్సాస్ అధికారులు ప్రకటించారు. శనివారం చోటు చేసుకున్న ఈ టోర్నడో తుపానుతో లూసియానా, మిస్సిస్సిపీ, అలబామా, ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్, కాన్సాస్ తదితర రాష్ర్టాల్లో ముప్పు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కాగా తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఇప్పటికే రెస్క్యూ చర్యలు పెద్ద ఎత్తున ప్రారంభించామని అధికారులు ప్రకటించారు.