ధారవి పనుల నిలుపుదలకు సుప్రీం నో!
Supreme Court says no to halting Dharavi work!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో అత్యంత పెద్ద మురికివాడగా పేర్కొంటున్న ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులను నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది. శుక్రవారం ఈ పిటిషన్ పై న్యాయమూర్తి సీజేఐ ఖన్నా విచారణ చేపట్టారు. ముంబాయి హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు కూడా ఆయన నిరాకరించారు. అదానీ గ్రూప్ వాదనను అంగీకరిస్తూ ఇప్పటికే ధారవి ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కూల్చివేతలు జరిగాయన్నారు. రైల్వే క్వార్టర్లను కూల్చివేశారని చెప్పారు. పిటిషన్ లో ధారవి పునరాభివృద్ధి అదానీ ప్రాపర్టీస్ కు ఇవ్వాలనే రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు సవాల్ చేశారు. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీజేఐ పిటిషనర్ వాదనను తిరస్కరిస్తూ మే 2025కు విచారణను వాయిదా వేశారు.