మన్మోహన్ స్మారక చిహ్నం స్థలం.. కుటుంబం ఆమోదం
Manmohan memorial site..family approval

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని జాతీయ స్మారక చిహ్నాంలోనే నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు హోంమంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాసి ప్రతిపాదిత స్థలాన్ని ఎన్నుకున్న విషయాన్ని శుక్రవారం తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం సమీపంలోనే స్థలాన్ని ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన అంగీకారపత్రాన్ని కూడా సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపారు. మన్మోహన్ స్మారక చిహ్నం నిర్మాణంపై ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ ప్రతిపాదత స్థలాలను సందర్శించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 900చ.మీ. ఈ స్థలం విస్తరించి ఉంది. స్మారక చిహ్నం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 25 లక్షల గ్రాంట్ ను మంజూరు చేయనుంది. అంతకుముందు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి భూమిని ఆ ట్రస్ట్ పేరు మీద బదిలీ చేస్తారు.