భారత్–చైనా వాణిజ్యంలో బలమైన వృద్ధి
యూఎన్సీటీఎడీ నివేదికలో వెల్లడి

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్–చైనా వాణిజ్యంలో బలమైన వృద్ధి కొనసాగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి సమావేశం (యూఎన్సీటీఎడీ) స్పష్టం చేసింది. 2024 నాలుగో త్రైమాసికం అక్టోబర్–డిసెంబర్ మధ్య నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ త్రైమాసికంలో 8శాతం దిగుమతి, వార్షిక దిగుమతులు ఆరు శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. వస్తువులలో త్రైమాసిక ఎగుమతి వృద్ధి విషయానికి వస్తే 7 శాతం, వార్షిక ఎగుమతి వృద్ధిని 2 శాతంగా చెప్పింది. రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశం ఉందని కూడా ఈ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వాణిజ్యం 1,200 బిలియన్ డాలర్లు, 9 శాతం పెరిగి 2024 నాటికి 33,000 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రకటించింది. ముఖ్యంగా భారత్–చైనా లో ఆశించిన దాని కంటే మెరుగైన వాణిజ్య విస్తరణ ఉందని తెలిపింది. ఇదే సమయంలో అనేక ప్రపంచదేశాల్లో వాణిజ్యం దిగజారిందని పేర్కొంది. భారత్ లో మిశ్రమ ధోరణులు, ఎగుమతుల పెరుగుదల, దిగుమతుల్లో వృద్ధి ధోరణులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. రానున్న కాలంలో సేవా వాణిజ్య వృద్ధి బలంగా ఉంటుందని, సానుకూల ధోరణి స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.