ఆప్ సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్ కు రాష్ట్రపతి ఆమోదం
President approves AAP's Satyendra Jain prosecution

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నుంచి ఆమోదం లభించిందని ఈడీ మంగళవారం వెల్లడించింది. బీఎన్ ఎస్ సెక్షన్ 218 కింద కోర్టులో ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని ఇటీవలే హోంశాఖరాష్ట్రపతిని లిఖిత పూర్వకంగా కోరింది. తగిన ఆధారాలు లభించాయని, విచారణ, ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదం కోరారు. ఆమోదం లభించడంతో సత్యేంద్రజైన్ చుట్టూ ఉచ్చు మరింత బిగించుకోనుంది. మద్యం కుంభకోణంలో సత్యేంద్ర జైన్ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. సుకేశ్ చంద్రశేఖర్ అనే నిందితుని ద్వారా భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.