అగస్టా వెస్ట్ ల్యాండ్ నిందితుడికి బెయిల్
Bail for Augusta Westland accused

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో నిందితుడు క్రిస్టియన్ మైఖేల్ కు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు మంగళవారం అతనికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 3600 కోట్ల విలువైన 12 హెలికాప్టర్ల కొనుగోలులో అతని పాత్రప సీబీఐ,ఈడీలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. 2018లో అతన్ని దుబాయ్ నుంచి భారత్ కు రప్పించి అరెస్ట్ చేశాయి. మైఖేల్ బ్రిటిష్ పౌరుడు. ఇప్పటికే జేమ్స్ ఆరు సంవత్సరాలుగా కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి జేమ్స్ బెయిల్ పై విడుదలవుతారని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జేమ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు సుప్రీంకోర్టు కూడా ఇతని బెయిల్ ను నిరాకరించింది.