మోదీ చర్యలు ఫలప్రదం ఎంపీ శశిథరూర్
Modi's actions are fruitful: MP Shashi Tharoor

తిరువనంతపురం: ఉక్రెయిన్ జెలెన్స్కీ, రష్యా వ్లాదిమిర్ పుతిన్ లకు ప్రధాని మోదీ అంటే అత్యంత గౌరవమని, ప్రధాని మోదీ శాంతి చర్చలు ఫలప్రదం అవుతూ యుద్ధఘంటికలు నిలిచిపోనున్నాయని ఎంపీ శశిథరూర్ అన్నారు. బుధవారం కేరళ తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జెలెన్స్కీ, పుతిన్ లను ఆలింగనం చేసుకున్న నేత ప్రధాని మోదీ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేశారన్నారు. రెండు దేశాలు కూడా మోదీ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. నాటో పంపించే శాంతి పరిరక్షక దళాలను రష్యా అంగీకరించే పరిస్థితుల్లో లేనందున భారత్ నుంచి శాంతి పరిరక్షక దళాలు వెళ్లే ఆస్కారం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్ పై భారతదేశ వైఖరిని విమర్శించిన ఎంపీని కూడా తానేనని, అప్పటి వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యనించారు. కాగా శశిథరూర్ వ్యాఖ్యలపై ఓ వైపు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.