ఎనిమిదోసారి బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్​

Minister Nirmala Sitharaman will present the budget for the eighth time

Feb 1, 2025 - 10:31
 0
ఎనిమిదోసారి బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం ఉదయం 8.45 నిమిషాలకు తన ఇంటి నుంచి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు బయలుదేరారు. అనంతరం ఆర్థిక శాఖకు చేరుకొని అరగంటపాటు మంత్రివర్గంలో పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అక్కడి నేరుగా రాష్​ర్టపతి భవన్​ కు చేరుకున్నారు. అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూను కలుసుకొని బడ్జెట్​ కాపీని అందించి బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తీసుకున్నారు. 10.30 గంటలకు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. కేబినెట్​ లో బడ్జెట్​ కు ఆమోదముద్ర లభించింది. ఉదయం 11 గంటల నుంచి బడ్జెట్​ ను పార్లమెంట్​ లో మంత్రి నిర్మల ప్రవేశపెట్టనున్నారు. 

మంత్రి నిర్మలా సీతారామన్​ ఎనిమిదోసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ సందర్భంగా బిహార్​ లోని 2021 పద్మ శ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి అందించిన చీరను మధుబని చీరను ధరించారు.