10మంది భారతీయ బందీలను రక్షించిన ఐడీఎఫ్​

IDF rescues 10 Indian hostages

Mar 7, 2025 - 16:58
 0
10మంది భారతీయ బందీలను రక్షించిన ఐడీఎఫ్​

జేరూసలెం: ఇజ్రాయెల్​ వెస్ట్​ బ్యాంక్​ నుంచి 10 మంది భారతీయ కార్మికులను సురక్షితంగా రక్షించింది. గురువారం అర్థరాత్రి ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహించి బందీలను సురక్షితంగా విడిపించి ఇజ్రాయెల్​ కు చేర్చారు. వీరిని ఒకనెలపాటు పాలస్తీనియన్లు బంధించారు. పాస్​ పోర్టులు లాక్కున్నారు. భారతీయులను పని ఆశచూపి వెస్ట్​ బ్యాంక్​ కు తీసుకువెళ్లి బందీలుగా చేసుకున్నారు. వీరి ద్వారా స్వాధీనం చేసుకున్న పాస్​ పోర్టుల ద్వారా అక్రమంగా ఇజ్రాయెల్​ లోకి ప్రవేశించాలని పాలస్తీనియన్లు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఐడీఎఫ్​ బందీలను విడిపించే ఆపరేషన్​ ను గుట్టుచప్పుడు కాకుండా చేపట్టి విజయం సాధించింది. బందీల విడుదల సమాచారాన్ని ఇజ్రాయెల్​ లోని భారత రాయబార కార్యాలయానికి అందించింది. 
ఇజ్రాయెల్​–హమాస్​ యుద్ధ పరిస్థితుల్లో తీవ్ర కార్మికుల కొరత ఏర్పడడంతో భారత్​ ఒప్పందం ప్రకారం 45వేల మంది కార్మికులకు ఆ దేశానికి పంపింది. అంతకుముందు ఇజ్రాయెల్​ లో అనేక రంగాల్లో పాలస్తీనియన్లు పనిచేసేవారు. యుద్ధం తరువాత ఇజ్రాయెల్​ పాలస్తీనియన్లను ఉద్యోగాల్లో నియమించుకోవడం లేదు. దీంతో భారతీయులకు మంచి డిమాండ్​ ఏర్పడింది. అత్యధిక వేతనాలు అందజేస్తూ నివాసం, ఆహారం, వైద్యం తదితర అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది.