కాశీ, అయోధ్య.. ఇక మధుర వంతు!
సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: కాశీ, అయోధ్య తరువాత ఇప్పుడు మధుర వంతు వచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం మధురలో పర్యటించిన యోగి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత హోలి సంబురాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అయోధ్య, ప్రయాగ్ రాజ్ వలె మధుర, బృందావన్, బర్సానా,గోకుల్, గోవర్దన్, బలదేవ్ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఐదువేల సంవత్సరాలుగా సనాతన సంస్కృతికి శక్తినిస్తున్న బ్రజ్ భూమి భక్తి, విశ్వాసాలకు నిలయమన్నారు. ఉత్తరప్రదేశ్ లోనే ఈ మూడు తీర్థ స్థానాలు ఉండడం అదృష్టమన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా, పుకార్లను వ్యాపింప చేసినా వారికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ ఏడాది బడ్జెట్ లో బర్సానాలో రోప్ వే సౌకర్యం ప్రారంభిస్తామని చెప్పారు.