సెమీస్ లో కంగారు చిత్తు
Kangaroo lost in the semis

విజృంభించిన విరాట్ కోహ్లీ
చివరలో టెన్షన్ తగ్గించిన పాండ్యా
బౌండరీతో విజయాన్నందించిన కెఎల్ రాహుల్
దుబాయ్: దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ సెమీఫైనల్ లో కంగారును భారత్ చిత్తు చేసింది. దీంతో ఫైనల్ లో బెర్త్ ను దక్కించుకుంది. 48.1 ఓవర్లలోనే 265 పరుగులకు గాను ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించి విజయాన్ని కైవసం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ పోరు కొన సాగుతుందనుకున్న తరుణంలో హార్ధిక్ పాండ్యా అవలీల బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లను కంగారెత్తించారు. మ్యాచ్ విజయానికి మరో ఆరు పరుగులు, 13 బాల్స్ వద్ద హార్ధిక్ అవుట్ అవుట్ కాగా మరోసారి టెన్షన్ మొదలైంది. కాగా అప్పటికే 13 బంతుల్లో ఆరు పరుగులు సాధించాల్సి ఉంది. ఈ సమయంలో రవీంద్ర జడేజా రంగంలోకి దిగి రెండు పరుగులను సాధించి కెల్ రాహుల్ కు బ్యాట్ ను అందించాడు. దీంతో రాహుల్ 6 పరుగుల బౌండరీని రాబట్టి విజయాన్ని అందించాడు. కోహ్లినే ముగిస్తాడని ఆశించినా చివరలో వెనుదిరగడంతో మ్యాచ్ లో టెన్షన్ పెరిగింది.
మ్యాచ్ విజయానికి హార్ధిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు.
దుబాయ్ లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్–ఆస్ట్రేలియాలు మంగళవారం సెమీఫైనల్ లో తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 49.3 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి భారత్ కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. కాగా వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ లు కీలక వికెట్లను సాధించి మ్యాచ్ లో పట్టును పెంచారు. స్కోర్ బోర్డు మరింత పరుగులు తీయకుండా కట్టడి చేయగలిగారు.
కాగా ఈ నెల 9న దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియా పరుగులు..
హెడ్ 39, కూపర్ 0, స్మిత్ 73, లబూస్కెంజ్ 29, జోష్ ఇంగ్లీస్ 11, అలెక్స్ 61, మాక్స్ వెల్ 7, ద్వార్ షూయిస్ 19, జంపా 7, నాథన్ 10, సంగా 1(నాటౌట్).
భారత్ బౌలింగ్, వికెట్లు
షమీ 10 ఓవర్లలో (3 వికెట్లు), హార్ధిక్ పాండ్యా 5.3 (1), కుల్ దీప్ యాదవ్ 8 (0), వరుణ్ చక్రవర్తి 10 (2), అక్షర్ 8 (1), రవీంద్ర జడేజా (2).
భారత్ పరుగులు..
రోహిత్ శర్మ 28, శుబ్ మన్ గిల్ 8, విరాట్ కోహ్లీ 84, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, కెఎల్ రాహుల్ 42 నాటౌట్, హార్దిక్ పాండ్యా 24, రవీంద్ర జడేజా 2 నాటౌట్.
ఆస్ట్రేలియా వికెట్లు..
బెన్ 1, నాథన్ 2, కూపర్ 1, జంపా 2 వికెట్లను సాధించారు.
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు..
టీమిండియా సెమీ ఫైనల్ లో విజయం పట్ల కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన భారతదేశానికి అభినందనలు తెలిపారు. భారత జట్టు అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు. విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్తో అదరగొట్టారన్నారు. ఫైనల్స్కు చేరిన భారత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రదర్శనతో ఐసీసీ 2025 చాంపియన్ గా నిలవాలని ఆకాంక్షించారు.